కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకి రూ. 2లక్షలు, వీరమణికి రూ. 1లక్ష, మాడ్గుల్ మండలం కొరతండాకి చెందిన బిచ్చికి రూ. 1,50,000లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్లోని తన కార్యలయంలో లబ్ధిదారులకు నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందని తెలిపారు.
ఈ పథకంతో పేదలకందరికీ కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు రమేశ్రెడ్డి, హరిచంద్నాయక్, ఈశ్వర్నాయక్, ఉప సర్పంచ్ సంతోశ్నాయక్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగుప్తా, మండల గౌరవాధ్యక్షుడు గంప శ్రీను, యువజన సంఘం అధ్యక్షుడు వీరేంద్రగుప్తా పాల్గొన్నారు.