కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ. 97,500లు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైంది. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుడికి సుభాశ్ పత్రీజీతో కలిసి ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్యయాదవ్, సాంబశివరావు, దామోదర్రెడ్డి పాల్గొన్నారు.