మర్పల్లి : ప్రభుత్వం పార్టీలకు అతితంగా, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త శ్రీనివాస్రెడ్డి కొన్నిరోజుల క్రితం ప్రైవేట్ దవాఖానలో చికిత్సలు చేయించుకున్న బిల్లులతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా లక్షా 50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు వచ్చింది. శుక్రవారం వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతితంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాణి గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.