షాబాద్ : ప్రభుత్వ నిధులతో గ్రామాలన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడులో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి శుభోదయం కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల మిగిలిపోయిన గ్రామాలకు బీటీరోడ్లు వేయించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
గిరిజన తండాలో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లానీరు అందించి ఆడబిడ్డల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఆసరా పింఛన్లు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్న షాబాద్ మండలంలో ఏర్పాటైన వివిధ రకాల పరిశ్రమలతో ఈ ప్రాంత యువకులకు ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. శుభోదయం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని గ్రామాలన్నింటిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలు దశలవారిగా పరిష్కరిస్తామన్నారు.
70 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోన్న స్వప్నారెడ్డి, మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్పాషా, మార్కెట్ డైరెక్టర్ సూద యాదయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పోన్న నర్సింహారెడ్డి, పి.దర్శన్, మల్లేశ్, దేవేందర్రెడ్డి, ఆశోక్గౌడ్, భూపాల్రెడ్డి, రాజుగౌడ్, గోపాల్, రమేశ్యాదవ్, రాందేవ్, శ్రీధర్రెడ్డి, ఇనాయత్, రాంచందర్, అవిలాశ్గౌడ్, శివ తదితరులు ఉన్నారు.