తుర్కయాంజల్ : ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడ సాగర్ రహదారిలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న సామ తేజస్వీరెడ్డి బంగారు పథకాన్ని సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బిట్ల శ్రీనివాస్రెడ్డి, యండి సంగమేశ్వరగుప్తా, పాఠశాల ఉపాధ్యాయ బృందం తేజస్విని శాలువాతో సన్మానించి అభింనందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవుతో పాటు క్రీడల్లో రాణించేలా తమ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉన్నందున విద్యార్థుల ఆసక్తిని బట్టి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని యోగాసన పోటిల్లో రాష్ట్రస్థాయిలో బంగారు పథకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్రెడ్డి, కో-ఆర్డినేటర్ రాజకుమారి పాల్గొన్నారు.