చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామంలో నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శనివారం మల్లికార్జున స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం చేపట్టారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈర్లపల్లి గ్రామం నుంచి మహిళలు బోనాలు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామ సర్పంచ్ ముత్తంగి రాజశేఖర్ ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి నరేందర్, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.