ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధికారిగా పని చేస్తున్న గంగాపురం సరిత రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును జనవరిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవాసంస్థ (ఎన్ఎస్ఎస్) రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా గంగాపురం సరితను ఎంపిక చేస్తూ క్రీడల రాష్ట్ర కార్యదర్శి నవీన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం సమీంపలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సరిత ప్రోగ్రాం ఆఫీసర్గా విధులు నిర్వహించారు.
2017-18 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయిలో ఆరుగురు అధికారులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ తాను చేసిన కార్యక్రమాలకు తమను రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో నాకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.