షాద్నగర్రూరల్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ల గడువును నవంబర్ 15వరకు పెంచినట్లు టీఓఎస్ఎస్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెంచిన గడువును విద్యార్థులకు తెలిసే విధంగా టీఓఎస్ఎస్ కళాశాల అధ్యాపకులు కృషి చేయాలని కోరారు.