శంకర్పల్లి : యువకులు దైవ చింతనను అలవరుచుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తా సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41రోజులు కఠోర దీక్షలు చేసి ఇరుముడులను శభరి దేవాలయంలో 18మెట్లు ఎక్కి స్వామి వారికి సమర్పించడం ఎంతో శుభకరం అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మాజీ సర్పంచ్ సాత ఆత్మలింగం, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్కుమార్, గురు స్వాములు దండు మోహన్, గుండ శేఖర్, మిరియాల శ్రీనివాస్, నాయకులు పార్శి బాలకృష్ణ, గోపాల్రెడ్డి, శ్రీనావాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పలు గ్రామాల భక్తులు పాల్గొన్నారు.