శంకర్పల్లి : దైవ కార్యక్రమాలు చేయడం, దేవాలయాలు నిర్మించడం పూర్వజన్మసుకృతమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు మన్నె లింగం ముదిరాజ్ నిర్మించిన పోచమ్మ, ఎల్లమ్మ దేవాలాయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయంపై హెలిక్యాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడం ఆనందాన్ని కలిగించిందన్నారు. విలువైన భూమిలో మన్మె లింగం గుడి నిర్మించడం అభినందనీయమన్నారు. అంతకు ముందు చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, రాజేంద్రనగర్, కొడంగల్ ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, నరేందర్రెడ్డి, మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కాగా గుడి ప్రారంభోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపు భక్తులను ఆనందోత్సాహాలతో మైమరిపింప చేసింది. కార్యక్రమంలో శంకర్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బద్ధం శశిధర్రెడ్డి, గుడిమల్కాపూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, శంకర్పల్లి మండలం, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, వాసుదేవ్కన్నా, మండల టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్గౌడ్, నాయకులు పార్శి బాలకృష్ణ, మోకిల టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.