యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని బుధవారం పురోహితుల వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి, మైసమ్మ, ఎల్లమ్మ, గణపతి, నంది, ధ్వజ కౌండిన్య మహాముని, సింహవాహన ప్రతిష్ట కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదగిరిగుట్టను యాదాద్రి ఆలయంగా అద్భుతంగా పునర్మించినట్లు పేర్కొన్నారు. నల్లవెల్లి గ్రామం దేవాలయాలకు నిలయం కావడంతో ఎంతో ఆధ్యాత్మికత సంతరించుకుందన్నారు. గ్రామంలో అతి పురాతన దేవాలయాలున్నాయని వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెపొందించుకోవాలన్నారు.
బొగ్గుల గట్టు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, కారింగు యాదయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.