కోట్పల్లి, ఆగస్టు 29: మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. కొత్త మండలం కోట్పల్లిని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని అందు కోసం జడ్పీ నిధుల నుంచి 6.50 కోట్లతో అన్ని గ్రా మాలను అభివృద్ధి చేస్తానన్నారు. సోమవారం లింగంపల్లి చౌరస్తా నుంచి కోట్పల్లి నూతన ఎంపీడీవో కార్యాలయం వరకు దాదాపుగా 400 మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.
అనంతరం ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు పాలనను దగ్గర చేసేందుకు సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేశారన్నారు. కోట్పల్లి మండల ఏర్పాటుకు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల అభ్యున్నతి కోసం రూ.6.50 కోట్ల జడ్పీ నిధులను ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటు అనంతరం రూ. 70 లక్షలతో నిర్మించిన మొదటి భవనం కోట్పల్లిదే అని అన్నారు. భవనంలో మరిన్ని పనులను చేపట్టేందుకు జడ్పీ నుంచి రూ.30 లక్షలు, ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 20 లక్షలను తీసుకొస్తాన్నారు. త్వరలోనే ఎంపీపీలకు కూడా నిధులు వస్తాయని.. కొత్త మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.
కోట్పల్లిలో డ్వాక్రా భవన నిర్మాణానికి రూ. 10 లక్షలను మంజూరు చేస్తానని ఆమె తెలిపారు. మండలానికి 740 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనంతరం ఆమె జడ్పీహెచ్ఎస్కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ పీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ సావిత్రి, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ మహేశ్గౌడ్, నరేందర్రెడ్డి, బందెయ్య, ఆయా గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.