రంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకున్నది. జిల్లా పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుండడంతో చాలామంది ఇక్కడ వ్యవసాయేతర భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూ క్రయవిక్రయదారులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. జూలై నెలలో జిల్లావ్యాప్తంగా 20,006 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాగా, రూ.285 కోట్ల రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇందులో అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే వచ్చింది. ఇక్కడ మొత్తం 1,849 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయగా.. రూ.74.98 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యల్పంగా కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రూ.10.52లక్షల రెవెన్యూ వచ్చింది.
రంగారెడ్డి, ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ): జూలైలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో ల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.285 కోట్లు సమకూరింది. జూలైలో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రాగా, అత్యల్పంగా కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా సమకూరింది. జూలైలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 20,006 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
జిల్లాలో రిజస్ట్రేషన్లతో ఆదాయం(రూ.కోట్లలో)
ఎస్ఆర్వో ఆదాయం : కార్యాలయం
రంగారెడ్డి
జిల్లా రిజిస్ట్రార్ : 74.98
గండిపేట : 43.24
శేరిలింగంపల్లి : 34.35
వనస్థలిపురం : 7.98
మహేశ్వరం : 20.93
రాజేంద్రనగర్ : 19.33
చంపాపేట్ : 11.43
ఎల్బీనగర్ : 11.27
శంషాబాద్ : 7.65
చేవెళ్ల : 6.33
ఇబ్రహీంపట్నం : 6.74
సరూర్నగర్ : 7.10
ఫరూఖ్నగర్ : 6.08
శంకర్పల్లి : 7.31
హయత్నగర్ : 5.35
షాద్నగర్ 4.35
పెద్దఅంబర్పేట్ : 4.05
అబ్దుల్లాపూర్మెట్ : 2.76
వికారాబాద్ : 1.97
తాండూరు : 1.44
పరిగి : 1.04
కొడంగల్ .1052
డాక్యుమెంట్ల రిజస్ట్రేషన్
ఎస్ఆర్వో : డాక్యుమెంట్లు కార్యాలయం
రంగారెడ్డి
జిల్లా రిజిస్ట్రార్ : 1849
మహేశ్వరం : 1853
చంపాపేట్ : 1160
గండిపేట్ : 1131
వనస్థలిపురం : 1083
ఇబ్రహీంపట్నం : 1488
ఫరూఖ్నగర్ : 1369
చేవెళ్ల : 881
రాజేంద్రనగర్ : 1031
ఎల్బీనగర్ : 973
అబ్దుల్లాపూర్మెట్ : 639
శేరిలింగంపల్లి : 925
పెద్దఅంబర్పేట్ : 862
సరూర్నగర్ : 598
వికారాబాద్ : 495
తాండూరు : 446
హయత్నగర్ : 625
షాద్నగర్ : 830
పరిగి : 256
కొడంగల్ : 91