చేవెళ్ల రూరల్, డిసెంబర్ 21 : పట్టాదారు పాసు పుస్తకం ఉండి పీఎం కిసాన్ డబ్బు ఖాతాలో పడుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణాధికారి రమేశ్ పంచాయతీ కార్యాలయంలో పీఎం కిసాన్ ఈకేవైసీ అప్డేట్ ప్రక్రియను దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ.. చేవెళ్ల మండలంలోని ఈకేవైసీ అప్డేట్ చేసుకోని రైతులు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో కూడా సులువుగా ఈకేవైసీని అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని సూచించారు. రైతు స్థాయిలో పీఎం కిసాన్ ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే https://ex link.pmkisan.gov.in/aadharekyc.aspx లింకు ద్వారా అప్డేట్ చేసుకోవాలని సూ చించారు. ఏఈవో వెంట రైతులు తదితరులు ఉన్నారు.