చేవెళ్లటౌన్, డిసెంబర్ 21: విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ వరదారెడ్డి, కార్యదర్శి సంతోష్ రెడ్డి, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, డైరెక్టర్ కృష్ణా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోయారాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.