ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 19: వ్యవసాయ రంగం లో వస్తున్న నూతన విధానాలతోపాటు అధిక లాభాలిచ్చే లాభసాటి వ్యవసాయంపై రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్న రైతువేదికలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం 83 రైతువేదికలను నిర్మించింది. ఇందులో ప్రతి వారానికోసారి రైతులతో సమావేశం ఏర్పాటుచేసి వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, అధిక దిగుబడులను ఇచ్చే పంటలపై వ్యవసాయాధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు. నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతి వేదికకు ప్రతినెలా రూ. తొ మ్మిది వేల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి వేదికకూ రూ. తొమ్మిది వేల చొప్పున ఐదు నెలల కాలానికి రూ.45 వేలను ..జిల్లాలోని 83 రైతువేదికలకు మొత్తం రూ.37.35 లక్షలను కేటాయించింది.
ఈ నిధులతో చేపట్టాల్సిన పనులు..
ప్రభుత్వం ఒక్కొక్క రైతువేదికకు ప్రతినెలా రూ.9 వేల చొప్పున ఇస్తున్నది. ఇందులో రూ. వెయ్యి కరెంటు బిల్లు, రూ. వెయ్యి వాటర్బిల్లు, ప్రతివారం నిర్వహించే సమావేశం నిమిత్తం రూ. రెండు వేలు, మరమ్మతులకోసం రూ.వెయ్యి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నిమిత్తం రూ.వెయ్యి, మిగతా రూ.మూడు వేలను నిర్వహణ ఖర్చులకు వినియోగించుకునేందుకు కేటాయిస్తున్నది. ఈ నిధులను సంబంధిత ఏఈవోల ఖాతాల్లో జమ చేయనున్నది. సంబంధిత ఏఈవోలు బిల్లులను సూచించి నిధులు డ్రా చేసుకునే అవకాశముంటుంది. సీఎం కేసీఆర్ రైతులను సంఘటితం చేయాలనే ఉద్దేశంతో 2018లో రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి అక్కడ ఒక రైతువేదికను రూ.22లక్షలతో ఏర్పాటు చేశారు.
వాటి నిర్వహణ కోసం నెలకు రూ. 9 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కారణంగా నిధుల కేటాయింపులో కొంత జాప్యం జరిగినా, అప్పుడు అన్నట్లుగానే ప్రస్తుతం ఐదు నెలల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కొన్నిచోట్ల దాతల స్థలాల్లో నిర్మించగా.. మరికొన్ని ప్రాం తాల్లో సొంత ఖర్చులతో ప్రభుత్వం నిర్మించింది. 2020-21లో రైతువేదికలు అందుబాటులో వచ్చా యి. అప్పటి నుంచి అన్నదాతలకు సేవలందిస్తున్నాయి. ప్రతి సీజన్లోనూ రైతులకు శిక్షణా కార్యక్రమాలను వ్యవసాయాధికారులు నిర్వహిస్తున్నారు. రైతులు ఏయే పంటలు వేయాలి…నేలల స్వభావం ప్రకారం ఎలాంటి పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, రైతుబంధు, రైతుభీమా వం టి సమగ్ర సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
నిర్వహణ నిధులు వచ్చాయి
రైతువేదికలు నిర్మించిన తర్వాత తొలిసారిగా నిర్వహ ణ నిమిత్తం నిధులు వచ్చా యి. క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులు వాటిని వివిధ అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తారు. రైతులకు అనేక రకాలుగా సేవలందిస్తున్న వేదికలను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది.
-సత్యనారాయణ, ఏడీఏ ఇబ్రహీంపట్నం
సంతోషించదగ్గ విషయం
రైతువేదికల నిర్వహణకు ప్రభు త్వం నిధులను విడుదల చేయ డం చాలా సంతోషించదగ్గ విష యం. వీటితో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించొచ్చు. అన్నదాతల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. -మొద్దు అంజిరెడ్డి,
రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు