బొంరాస్పేట, డిసెంబర్ 17 : మండలంలోని లోతుకుంటతండా నుంచి మెట్లకుంట మీదుగా బొంరాస్పేట వరకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సంట్రకుంటతండాకు బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏండ్ల నాటి బీటీ రోడ్డు కలను ఎమ్మెల్యే నెరవేర్చారని అన్నారు. ఈ సందర్భంగా లోతుకుంటతండా, సంట్రకుంటతండా, మెట్లకుంట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు చాంద్పాషా, తాలుకా అధికార ప్రతినిధి టీటీ రాములు, సర్పంచ్లు నారాయణ, లక్ష్మీ, రవినాయక్, ఎంపీటీసీ నర్సింహులు, రైతుబంధు అధ్యక్షుడు రమణారెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రవిగౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండ శ్రీనివాస్, నాయకులు సలీం, దేవేందర్గౌడ్, హరిలాల్, మహేశ్, ఆనంద్, లక్ష్మయ్య, రాజునాయక్, నెహ్రూనాయక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతల వెల్లువ
రోడ్డు సౌకర్యాలు లేక ఇబ్బందుల ఎదుర్కొంటున్న గిరిజనులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నేతృత్వంలో బీటీ రోడ్లు మంజూరు కావడంపై గిరిజనులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో అప్పయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పాయిపల్లి నుంచి ఆశమ్మకుంట తండా వాసులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. అదేవిధంగా మండలంలోని పోచమ్మతండా పరిధిలోని మైసమ్మతండా వాసులు తండాలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అప్పాయిపల్లి నుంచి ఆశమ్మతండా వరకు రూ.కోటీ 30లక్షలతో, పోచమ్మతండా నుంచి మైసమ్మతండా వరకు రూ.కోటీ 50లక్షలు మంజూరుతో బీటీ రోడ్లు మంజూరయ్యాయి. దీంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గిరిజనులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు శంకర్నాయక్, గీతాఠాకూర్తో పాటు శివకుమార్, ఎంపీటీసీ రామునాయక్, రెడ్యానాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.