పెద్దేముల్, డిసెంబర్ 11 : తాండూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ సర్పంచ్ పద్మమ్మగౌడ్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖమంత్రిగా ఉన్నప్పుడు తాండూరుకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానన్నారు. ఇక మీదట తాండూరు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బ్రిడ్జీలు, ప్రధాన రోడ్లు, తాండూరు-వికారాబాద్ ప్రధానరోడ్డు, రింగ్రోడ్డు, మైనారిటీ గురుకుల పాఠశాలకు నిధులు మంజూరు చేయించానన్నారు.
పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకు సాగాలని సూచించారు. జడ్పీ నిధులతో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించి, ప్రతి మండలానికి రూ. 5,6 కోట్లు కేటాయించి, సర్పంచులు, ఎంపీటీసీలకు జడ్పీ నిధులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పురుషోత్తంరావు, డీవై నర్సింహులు, మహిపాల్రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి, అంజిల్రెడ్డి, మాజీ సర్పంచులు ఎర్రబాలప్ప, ప్రకాశం, నారాయణ, ఎండీ, ఆజంఖాన్, ఇందూరు ప్రకాశ్, ఎంపీటీసీ శ్రీనివాస్, హర్షవర్ధన్ రెడ్డి, సంతోశ్, నయీం, సయ్యద్, అన్వర్, అజీమ్, రహీమ్, శివ, మల్లేశం, లికేష్, శ్రీను, వెంకటయ్య, రవి, అరుణ్, రవి గౌడ్, అబ్దుల్ రవూఫ్, శ్రీనివాస్, శ్రీకాంత్, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు
తాండూరు, డిసెంబర్ 11: తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలో ఆదివారం టీఎస్టీయూఫ్ 4వ జిల్లా మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో తాండూరు జడ్పీటీసీ ముంజుల, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, ఉపాధ్యాయులు ఉన్నారు.