కొడంగల్, డిసెంబర్ 11: సంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యానైనా సాధించొచ్చని నిరూపిస్తున్నది బీ కృష్ణవేణి. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బిజ్జారం కిష్టప్పకు ముగ్గురు సంతానం. అందు లో ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒక బాలుడున్నాడు. కృష్ణవేణి పెద్దమ్మాయి. తండ్రి గ్రామంలోనే గొర్రెలు, మేకలను మేపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక స్థోమత లేని కారణంగా అతడి ముగ్గురు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. ప్రస్తుతం కృష్ణవేణి యాలాల మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతున్నది. ఆర్థిక స్థోమత సహకరించకున్నా కరాటేలో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంటున్నది.
చిన్ననాటి నుంచే ..
కృష్ణవేణికి ఆరోతరగతి నుంచే క్రీడల్లో రా ణించాలనే ఆసక్తి పెరిగింది. ఆర్థిక స్థోమత సహకరించకపోవడంతో ప్రైవేటుగా ఆటలను నేర్చుకోలేక పోయానని, పాఠశాలలో నేర్పించే కరాటేను శ్రద్ధగా నేర్చుకున్నట్లు ఆమె తెలిపింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే కరాటే పోటీల్లో రాణిస్తున్నట్లు వివరించింది.
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో..
రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, కాంస్య పతకాలతోపాటు ప్రశంసాపత్రాలను సాధించింది. ఈ నెల 4వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో న్యూపవర్ కుంగ్ఫై, కరాటే మార్షల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవల్ ఆల్ ైస్టెల్స్ మార్షల్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ను సాధించినట్లు ఆమె పేర్కొన్నది. గతంలో నూ ఇతర రాష్ర్టాల్లో జరిగిన పోటీల్లోనూ పాల్గొని పతకాలను సాధించింది. కృష్ణవేణి క్రీడా ప్రతిభను గ్రామంలోని పెద్దలు, తోటి స్నేహితులు మెచ్చుకుంటున్నారు. గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ప్రోత్సాహం ఉంటే మరింత రాణిస్తా..
గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకుల్లో క్రీడల్లో రాణించే సత్తా ఉంటుంది. కానీ, వారు సరైన ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నారు. కరాటేలో రాణించాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుంచే శ్రద్ధగా నేర్చుకున్నా. ఆయా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ ల్లో పాల్గొని విజయం సాధించి బంగారు, కాంస్య పతకాలను సాధించా. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే రాష్ట్రం, దేశం తరఫున పోటీల్లో పాల్గొని సత్తా చాటుతా.
-కృష్ణవేణి, కరాటే క్రీడాకారిణి, రుద్రారం, కొడంగల్