శంకర్పల్లి, డిసెంబర్ 11 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు. వృద్ధులకు , వితంతువులకు, దివ్యాంగులకు మొదలగు వారికి ఆసరాతో ఆనందం నింపేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. నూతన ఆసరా పింఛన్ కార్డులను జారీ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది.
వయోవృద్ధ్దులకు, ఒంటరి మహిళలకు, గీతకార్మికులకు, చేనేత కార్మికులకు నెలకు రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016లను ప్రభుత్వం అందజేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 2016కి పెంచి నూతన పింఛన్ కార్డులను జారీ చేసింది. చేవెళ్ల నియోజక వర్గంలో వితంతువులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు మొత్తం 6140 మందికి కొత్త ఆసరా కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. శంకర్పల్లి మున్సిపాలిటీలో 471, మండలంలో 1512 మంది అర్హులను గుర్తించి, వారికి నూతన ఆసరా పింఛన్ కార్డులను జారీ చేసింది.
పింఛన్తో భరోసా కల్పించింది
57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొత్తగా ఆసరా కార్డులను మంజూరు చే యడం చాలా సంతోషంగా ఉంది. వృ ద్ధ్దాప్యంలో కష్టం చేతకాని వారికి పింఛ న్ ఎంతో ఉపయోగపడుతుంది. మా లాంటి వారికి పింఛన్లు అందించి ఆదుకుంటున్న సీ ఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– రవీందర్, శంకర్పల్లి
అర్హులందరికీ ఆసరా కార్డులు
పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అన్ని వర్గాల వారిని ఏదో ఒక పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. దివ్యాంగులకు రూ. 3016, వృద్ధులు, వితంతువులకు, చేనేత కార్మికులకు రూ. 2016లను ప్రభుత్వం అందజేస్తున్నది.
-ఎంపీపీ గోవర్ధన్రెడ్డి