షాద్నగర్ రూరల్, డిసెంబర్ 11 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో గల రంగదాముల గ్రామంలో శ్రీరంగనాయక స్వామి ఆలయం ఎదుట ఆదివారం ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయా ల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. కా ర్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.
పేదలకు వరం.. సీఎం సహాయనిధి
షాద్నగర్టౌన్ : పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్కు శస్త్రచికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2.50 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, అంతయ్య, నాయకులు శంకర్, నర్సింహులు, శ్రీనివాస్, రాధాకృష్ణ పాల్గొన్నారు.