మొయినాబాద్, నవంబర్ 26 : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుభోదయం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని నందర్ఖాన్పేట్, దామర్ల పల్లి, లింగారెడ్డిగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో జట్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజల సంక్షేమానికి కోట్ల నిధులు ఖర్చు చేసి ప్రజా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు.
మత్స్యకారుల అభివృద్ధ్దికి కృషి
మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చందన్వెల్లి పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. పథకాలను ఉపయోగించుకుని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
ఆడపిల్లల కుటుంబానికి అండగా..
ప్రభుత్వం ఆడపిల్లల కుటుంబానికి అండగా నిలబడటానికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్నదని ఎమ్మె ల్యే యాదయ్య అన్నారు. 31 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఆర్థిక సాయం పొందిన ప్రతి కుటుంబం సీఎం కేసీఆర్ను కుటుంబ పెద్ద దిక్కుగా భావిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
పథకాలకు ఆకర్షితులై చేరికలు
ప్రజా సంక్షేమ పథకాలే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో సాయిరెడ్డిగూడ ఉపసర్పంచ్ పొన్న నారాయణరెడ్డి, వార్డు సభ్యుడు బింగి రాఘవేందర్, తదితరులు టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి సుకీర్తి, ఎంపీడీవో అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పొన్న స్వప్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, సర్పంచ్లు సులోచన, పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, శేఖర్రెడ్డి, దేవేందర్రెడ్డి, అశోక్గౌడ్, శ్రీనివాస్గౌడ్, కృష్ణాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.