కేశంపేట, నవంబర్ 26 : సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరుతున్నారని, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని బైర్ఖాన్పల్లి పరిధిలోని తెట్టెకుంటతండాకు చెందిన 35 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిలో సభావట్ గోవింద్నాయక్, శంకర్నాయక్, బాలు, దేవేందర్, మల్లేశ్, దీప్లా, రఘు, రమేశ్, శ్రీను, నరేశ్, శంకర్, మున్యా, కృష్ణ, ఇతర కార్యకర్తలు చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, సర్పంచ్ కృష్ణయ్య, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.