వికారాబాద్, నవంబర్ 22 : అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల పరిధిలో జరుగు తున్న అభివృద్ధి పనులు మరింత మెరుగుపడాలని, పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయా లని తెలిపారు. గ్రామాల్లోని అత్యవసర సమస్యలు వెంటనే పరిష్కరించాలని, దీర్ఘ కాలిక సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలందిస్తున్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఐకేపీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీవోఏలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిక
బంట్వారం, నవంబర్ 22 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన్న ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళ వారం క్యాంపుకార్యాలయంలో మండల కేంద్రంతో పాటు నాగ్వారంతండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు సర్పం చ్, నాయకులు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, ఎల్లయ్య ఆయా గ్రామాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్త వైద్యానికి ఎల్వోసీ అందజేత
మర్పల్లి, నవంబర్ 22: మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ప్రభాకర్ తండ్రి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే ఆనంద్ మంగళవారం రూ.ఐదు లక్షల ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్య కర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.