పూడూరు, నవంబర్ 21: పురాతనమైన శిలలపై ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మండలంలోని కంకల్ గ్రామంలోని వీరభద్రేశ్వరస్వామి ఆలయం చుట్టు పక్కల ఉన్న శాసనాలు, శిల్పాలను పరిశీలిస్తే అవి ఏడో శతాబ్దానికి చెందిన శిల సంపదగా పలువురు మేధావులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పార్శనాథుడు 24వ జైనమత తీర్థంకరుడు కాగా, ఆయన ఏడో శతాబ్దానికి చెందినవాడుగా చరిత్ర చెబుతున్నది. అందువల్ల కంకల్ గ్రామ పరిసరా ల్లో ఆనాడు జైనమతం ఉందని చెప్పేందుకు ఇవే నిదర్శనమని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
కాకతీయుల కాలం నాటి..
వీరభద్రేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లోని శాసనాలు, శిల్పాలను పరిశీలిస్తే శిల్ప సంపద ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు ప్రాచుర్యం పొందిన ట్లు తెలుస్తున్నది. చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి శాసనాలు కూడా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కంకల్ గ్రామంలోని వీరభద్రేశ్వరాలయాన్ని సుమారు 500 ఏండ్ల క్రితం నిర్మించి.. స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతున్నది.
శివాలయం, గణపతి ఆలయాలు వీరభద్రేశ్వరస్వామి ఆలయానికి అభిముఖం గా పడమర దిక్కు చూస్తున్నట్లు ఉన్నాయి. ఈ ఆలయ పరిసరాల్లో దాదాపుగా 60 వరకు శిలా శాసనాలు ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఆలయం పక్కనే ఉన్న గుండంలో పుష్కలంగా నీరు నిం డి ఉన్నది. కాగా ఇక్కడి శిలాసంపద, శాసనాలను మొఘ ల్ పాలకులు ధ్వంస చేసినట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు.
ఆనాటి విగ్రహాలు గ్రామంలో కొన్ని చోట్ల కనిపిస్తుండగా.. మరి కొన్ని ధ్వంసమైన విగ్రహాలు కాలగర్భం లో కలిసిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కంకల్ గ్రామంలో ఉన్న శతాబ్దాల కాలం నాటి చరిత్రను పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రాంతం గురించి ఎవరికీ తెలియడంలేదని.. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడి శిల్పా లు, శాసనాలను పూర్తి స్థాయిలో పరిశీలించి.. ధ్వం స మైన విగ్రహాలను సేకరించి స్థానికంగా చిన్నపాటి మ్యూ జియాన్ని ఏర్పాటు చేసి భద్రపరిస్తే రాబోయే తరాలకు వివరించే అవకాశం ఉంటుందని పలువురు కోరుతున్నా రు.
వందల ఏండ్ల క్రితం వెలిసిన వీరభద్రేశ్వరాలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది ప్రత్యేకతను చాటుకుంటున్నది. ప్రతి ఏడాది శివరాత్రి పండుగ సమయంలో ఇక్కడ ఐదు రోజులపాటు జాతరను వైభవంగా నిర్వహిస్తారు. ఈ స్వామి వారు కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల నమ్మకం. ఈ వేడుకకు రాష్ట్రంలోని పలు జిల్లాల కు చెందిన భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తా రు. ఈ ఆలయానికి వెళ్లేందుకు హైదరాబాద్ రోడ్డు అంగడిచిట్టంపల్లి, పరిగి రోడ్డు రాకంచర్ల, షాద్నగర్ రోడ్డు లాల్పహాడ్ స్టేజీల నుంచి రాకపోకలు సాగించేందుకు రోడ్డు మార్గం ఉన్నది.