చేవెళ్ల రూరల్, నవంబర్ 21 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట, గొల్లగూడ గ్రామాల్లో శుభోదయం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పల్లెలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని అభివృద్ధిలో దూసుకుపోయేలా కృషి చేస్తున్నదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లానీరు, ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమస్యలు లేని గ్రామాల సాధనకు అధికంగా శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా శుభోదయంలో తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే అడుగగా అందుతున్నాయని ప్రజలు జవాబిచ్చారు.
కమ్మెట గ్రామంలో ప్రధాన రోడ్డు సమస్యగా ఉందని ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, సర్పంచ్లు తులసి, రాంచందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు రమణారెడ్డి, మర్పల్లి కృష్ణారెడ్డి, హన్మంత్రెడ్డి, శేఖర్, నాగార్జునరెడ్డి, మల్కాపూర్ ఎంపీటీసీ రవీందర్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన ఆలయాలు
శంకర్పల్లి : చందిప్ప గ్రామంలో గల మరకత శివాలయంలో ఎమ్మెల్యే యాదయ్య పూజలు చేశారు. ఎంపీపీ గోవర్ధన్రెడ్డి కుటుంబ సమేతంగా మరకత శివలింగాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.