కొడంగల్, జూన్ 14: మున్సిపల్లో అభివృద్ధి పను లు నత్తనడకన కొనసాగుతున్నాయని, త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అధికారు లు, కాంట్రాక్టర్లకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో మున్సిపల్, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డితో కలిసి మున్సిపల్ పరిధిలో పర్యటించి, పనులు పరిశీలించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కలిసి కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేకంగా మంజూరైన రూ.15 కోట్లకు సంబంధించి పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతోపాటు కౌన్సిల్ మీటింగ్ జరిగి రెండు నెలలకుపైగా కావస్తున్నా తీర్మానించిన పనులకు నేటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు.
మున్సిపల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కె ట్, వైకుంఠధామాలు, తదితర పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టిన వెంటనే మట్టిని అక్కడ నుంచి తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. మురుగు కాల్వలు అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. గాంధీనగర్లోని పెద్దగుంతలో పార్క్ ఏర్పాటు చేసేలా త్వరగా చర్యలు చేపట్టాలని, 11వ వార్డులో మరుగుదొడ్ల సౌకర్యాలు లేక మహిళలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నదని అన్నా రు. 15 రోజుల్లో వాటిని పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును సూచించారు. కొడంగల్కు ఒక శ్మశాన వాటిక సరిపోదని, రెండు లేదా మూడు స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంతంలో మురుగు కాల్వల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని, కాలువపై బెడ్లు తప్పక ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కింద మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రారంభించాలని సూచించారు. మున్సిపల్లో పను లు త్వరగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించుకుందామన్నారు.
మిషన్ భగీరథ పనులు ప్రస్తుతానికి అక్కడక్కడ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయని, తద్వారా ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఏఈ హుస్సేన్పై ఆగ్రహా న్ని వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందుల తలెత్తకుండా పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసి పూర్తి స్థాయి సరఫరాకు చర్య లు చేపట్టాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల నిర్వహణపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులకు సూచించారు. రెం డు నెలల్లో పనులు పూర్తయితే సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రారంభోత్సవాలు నిర్వహించుకుందామన్నా రు. అనంతరం ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ నాయకులు మురారి వశిష్ట, సయ్యద్ ఉస్మాన్, రావుపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి సోదరుడు శరణ్భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, సంతాపం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు, మున్సిపల్ డీఈ, ఏఈ, విద్యుత్ డీఈ, ఏఈతో పాటు మిషన్ భగీరథ ఏఈ పాల్గొన్నారు.