తెలంగాణలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని, ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య అన్నారు. గురువారం జిల్లాలోని వివిధ మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
మంచాల, సెప్టెంబర్ 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 12500 మందికి బతుకమ్మ చీరలను ఎంపీపీ జాటోతు నర్మద, జడ్పీటీసీ మర్రి నిత్యతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆడపడుచుల ఆత్మ గౌరవ పండుగ బతుకమ్మ అని అన్నారు. కులమతాలకు అతీతంగా మైనార్టీలకు రంజాన్ పండుగ, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ, హిందువులకు బతుకమ్మ పండుగకు చీరలు, దుస్తులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. దసరా పండుగ తర్వాత ఇండ్ల స్థలాలు ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివా స్, తహసీల్దార్ అనిత, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
షాద్నగర్ : రాష్ట్రంలోని ఆడపడుచుల కండ్లలో సంతో షం నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. మన రాష్ట్రం ఏర్పడక ముందు మన సంస్కృతీ, సంప్రదాయాలకు తగిన విలువ లేకుండే అని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం మన పండుగలకు ప్రభుత్వం ఇస్తున్న విలువ మన కండ్ల ముందు కనిపిస్తున్నదని అన్నారు.
తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను నేటితరం చిన్నారులకు పరిచయం చేయాలని కోరారు. బతుకమ్మ చీరల తయారితో నేత కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు ఎంతోమంది కూలీలకు ఉపాధి లభించిందని అన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన నర్సింహులుకు రూ. 60 వేలు, సత్యనారాయణకు రూ. 60 వేలు, కవితకు రూ. 18 వేల 500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మన్నె నారాయణయాదవ్, శివకుమార్, రవీందర్రెడ్డి, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
చేవెళ్ల రూరల్ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి, కేసారం, కుమ్మెర, మల్కాపూర్ గ్రామాల్లో గురువారం నూతన పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరికీ అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016, వికలాంగులకు రూ.3016 అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.
ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను అవసరాలు తెలుసుకొని వారి సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, సర్పంచ్లు అనూష, రమేశ్ గౌడ్, భానుతేజ, శివారెడ్డి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిట్ట వెంకట రంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ ఘనీ, టీఆర్ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ రామాగౌడ్, కౌకుంట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతకింది నాగార్జునరెడ్డి, ఎంపీడీవో రాజ్కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు తోట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్కేపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ..
చేవెళ్ల మండలం ఎన్కేపల్లి గ్రామంలో ఎంపీటీసీ మాధవి, టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
బతుకమ్మ చీరలు పంపిణీ
షాబాద్ : కుమ్మరిగూడ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను సర్పంచ్ పోనమోని కేతన ఆధ్వర్యం లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభు త్వం మహిళల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా బతుకమ్మ చీరలు అందించడం సంతోషకరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అదే విధంగా మండలంలోని ఆయా గ్రామా ల్లో ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పంచాయతీ కార్యదర్శి రజినీకాంత్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రమేశ్యాదవ్, నానిగౌడ్, నర్సింహులు, అంగన్వాడీ టీచర్లు ఇందిర, సువర్ణ పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని ఫరూఖ్నగర్ జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రిస్ అహ్మద్ అన్నారు. మండలంలోని గంట్లవెల్లి గ్రామంలో సర్పంచ్ యాదమ్మతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించ డంతో పాటు వారు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బతుకమ్మ చీరలను అందుకున్న మహిళలు ఆనందోత్సవాలతో బతుకమ్మ సంబురాలను జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నారాయణయాదవ్, రవీందర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మాడ్గుల : నల్లచెరువు, అందుగుల, గిరికొత్తపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు మాలతీరెడ్డి, జయలక్ష్మి, హనుమాన్ రాథోడ్, ఉప సర్పంచ్ మల్లయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బ్రహ్మం, శ్రీను, రమేశ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : ఆడపడుచులకు సీఎం కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరలను పంపీణీ చేస్తున్నారని శేరిగూడ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. శేరిగూడ, మోకిల, గోపులారం, ప్రొద్దటూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు సత్యనారాయణ, నర్సింహారెడ్డి, పొడువు శ్రీనివాస్, సుమిత్ర, శేరిగూడ ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కో సం అనేక పథకాలను అమలు చేస్తున్నారని కర్కల్పహాడ్ సర్పంచ్ నాగమణి, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్ అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి వారు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
కేశంపేట: గ్రామాల్లోని మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, పోమాలపల్లి, కొండారెడ్డిపల్లి, చింతకుంటపల్లి, వేములనర్వ గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, స్వాతి, పార్వతమ్మ, మంజుల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.
మొయినాబాద్ : ప్రభుత్వం ఆడపడుచులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నా రు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో సర్పంచ్ స్వరూపతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.