కులకచర్ల, ఏప్రిల్ 8: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించే అండర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి భారీగా నిధులను మంజూరు చేస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీ లలిత, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్రెడ్డి, సారా శ్రీనివాస్, శేరిరాంరెడ్డి, నాగరాజు, హరికృష్ణ, ఆంజనేయులు, మొగులయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ఫండ్ చెక్కు అందజేత
మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ గ్రామానికి చెందిన శివకుమార్కు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కు అందజేశారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కులకచర్ల మండల పరిధిలోని మక్తవెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సీనియక్ నాయక్, మాజీ ఎంపీటీసీ ఊమ్లనాయక్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పరామర్శించారు. వారి వెంట జడ్పీటీసీ రాందాస్నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్నాయక్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పేదలకు అండగా సర్కారు
పరిగి, ఏప్రిల్ 8 : పేద ప్రజలకు సర్కారు అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండీడ్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మందికి సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా మంజూరైన రూ.13.18లక్షలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. చిట్యాల్ గ్రామానికి చెందిన యాదగిరికి చికిత్స నిమిత్తం రూ.లక్ష, దోమ మండల కేంద్రానికి చెందిన జి.రేశ్వంత్కు చికిత్స కోసం రూ.లక్ష ఎల్వోసీ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ పరిగి మండల మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు విజయ్ పాల్గొన్నారు.