షాద్నగర్టౌన్, ఆగస్టు 9 : భారత స్వాతంత్య్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డితో కలిసి మున్సిపాలిటీలోని 28వ వార్డులో ఇంటింటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు సత్యం, సుదర్శన్, జ్ఞానేశ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
షాద్నగర్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న నాగర్కర్నూల్ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం క్రీడా పోటీలను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు క్యారమ్స్ పోటీలను నిర్వహించారు.
శంకర్పల్లి, ఆగస్ట్ 9: వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ పిలుపు నిచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కడ్తాల్, ఆగస్టు 9 : మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని సినిమా టాకిస్లో గాంధీ చిత్రాన్ని కడ్తాల్ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు వీక్షించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉన్నదన్నారు. విద్యార్థులు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ హరిశంకర్గౌడ్, హెచ్ఎంలు జంగయ్య, దేవేందర్రెడ్డి, మల్లయ్య, నాయకులు బిచ్చానాయక్, నర్సింహ, పాండు, శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట, ఆగస్టు 9: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించారు. 24వ వార్డులోని ప్రజయ్ గుల్మొహర్లో కౌన్సిలర్ కందాడి అనుపమతో కలిసి చైర్పర్సర్ చెవుల స్వప్న చిరంజీవి, కమిషనర్ పి.రామాంజులరెడ్డి స్థానికులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్గౌడ్, మండల కోటేశ్వరరావు, నాయకులు సుప్రసేన్రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
శంకర్పల్లి, ఆగస్టు 9 : శంకర్పల్లి మున్సిపాలిటీలోని పలు థియేటర్లలో మహాత్మా గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు చూపించారు. శంకర్పల్లి సీఐ మహేశ్ గౌడ్ పర్యవేక్షణలో సినిమాను తిలకించారు. చేవెళ్లలో జరిగిన జెండా పంపిణీ కార్యక్రమంలో శంకర్పల్లి తహసీల్దార్ నయిమోద్దీన్ పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్, ఆగస్టు 9 : ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి దేశకీర్తిని పెంపొందించేలా ముందుకు సాగాలని వివిధ కళాశాల, పాఠశాలల టీచర్లు విద్యార్థులకు సూచించారు. వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం పట్టణంలోని థియేటర్లలో మహాత్మా గాంధీ చిత్రాన్ని విద్యార్థులు వీక్షించారు. దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాలు విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. థియేటర్ల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డీవో బాలూనాయక్ బందోబస్తు నిర్వహించారు.
షాబాద్, ఆగస్టు 9: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ అధికారులు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్, ఆగస్టు 9: మండల కేంద్రంలోని బస్స్టేషన్లో మంగళవారం వికారాబాద్ డిపో మేనేజర్ మహేశ్తో పాటు డ్రైవర్లు, ప్రయాణికులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ దివ్యాంగులకు 50 రూపాయలు చెల్లించకుండా ఉచితంగా ఈ నెల 13వ తేదీన బస్సు పాసులు అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల కంట్రోలర్ గణేశ్, బస్పాస్ కౌంటర్ ఇన్చార్జి గోపాల్, కార్న్ ఎగ్జిక్యూటివ్ వసంత్, చేవెళ్ల బస్స్టేషన్ కంట్రోలర్ రవీందర్, ప్రయాణికులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9 : నియోజకవర్గంలో స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కమిషనర్ యూసుఫ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలోని 21వ వార్డులో కౌన్సిలర్ మంగ జగదీశ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జగదీష్యాదవ్, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ, ఆగస్టు 9: కొత్తూరు మున్సిపాలిటీలో మున్సిపాల్ చైర్ పర్సన్ లావణ్యాయాదవ్ ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపాల్ కమిషనర్ వీరేందర్, మున్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు.