కొడంగల్, ఆగస్టు 9 : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకొందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంటింటికీ జెండా పంపిణీ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొని స్వాతంత్య్రాన్ని సాధించిన మహ నీ యులను స్మరించుకుందామని తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చిన సన్ని వేశాలను గాంధీ చిత్రం ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తిలకించాలన్నా రు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా నేతన్న నేసిన జాతీయ జెం డాలనే ఇం టింటికీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14న జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ విచ్చేస్తున్నారని, ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేపడదామని తెలిపారు.
మండలంలోని చిన్న నందిగామ గ్రామంలో ఎమ్మెల్యే పంట పొలాలను సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ ప్రభు త్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. పంట నష్టంపై సీఎంకు నివేదిక పంపించ నున్నట్లు తెలిపారు. పీర్ల పండుగను పురస్కరించుకొని మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కాశీం పీర్లను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. మండలంలోని అన్నారం గ్రామంలో సర్పంచ్ అనిత ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేయ డంతో పాటు గ్రామ పల్లె ప్రకృతివనంలో 75 వసంతాల వజ్రోత్సవాలను పురస్కరిం చుకొని 75వ సంఖ్యను సూచిస్తూ మొక్కలు నాటారు.
బొంరాస్పేట మండలంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడి, ఎంపీడీవో పాండు, ఎంపీటీసీ నారా యణరెడ్డిలు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మ న్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, రమేశ్, వెంకట్రెడ్డి, సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీరప్ప, వెంకట్రెడ్డి, శంకర్నాయక్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు దామోదర్రెడ్డి, సాయిలు, ఫయూమ్, రమేశ్బాబు, శివకుమార్, టీటీ రాములు పాల్గొన్నారు.