మంచాల : బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక స్నానాలకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దక్షణకాశీగా పిలిచే బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక స్నానాలను ఆచరించి అనంతరం స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులకు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సతీమణి ముకుందమ్మ స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదే విధంగా ఇబ్రహీంపట్నం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ ఆవరణలో ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రైవేటు దవాఖానకు చెందిన వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, సీఐ వెంకటేష్గౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్నం రాము, మహేందర్, జానీఫాషా పాల్గొన్నారు.