మంచాల : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించ తలపెట్టిన రైతుబంధు సంబురాల్లో భాగంగా శుక్రవారం మంచాల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రైతుబంధు పథకంపై, వ్యాసరచన, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ గతంలో వ్యవసాయం అంటే దండుగన్న రైతులను నేడు తెలంగాణ రాష్ట్రంలో పండుగల చేసిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ జాటోతు నర్మద, సహకార సంఘం చైర్మన్ బుస్సుపుల్లారెడ్డి, సర్పంచ్లు జగన్రెడ్డి, రాజు నాయక్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సుకన్య, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ, ఎంఈవో వెంకట్రెడ్డి, పాఠశాల ప్రథానోపాధ్యాయుడు నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు చీరాల రమేశ్, బహదూర్, నాయకులు ఏర్పుల చంద్రయ్య, పల్లె జంగారెడ్డి పాల్గొన్నారు.