పరిగి, సెప్టెంబర్ 13 : ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల’ ఏర్పాట్లపై జిల్లా అధికా రులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. వికారాబాద్ నియోజకవర్గానికి జిల్లా యువ జన క్రీడల అధికారి, వికారాబాద్ డీఎస్పీ, ఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి డీఆర్డీవో, పరిగి తహసీల్దార్, అదనపు ఎస్పీ, తాండూరు నియోజకవర్గానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారి, తాండూరు ఆర్డీవో, డీఎస్పీ, కొడంగల్ నియోజకవర్గానికి జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డీఎస్పీలను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. ఈనెల 16న జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బ్లాక్ గ్రౌండ్స్ వరకు 15వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు.
పరిగిలో కొడంగల్ క్రాస్రోడ్డు నుంచి మినీ స్టేడియం వరకు, తాండూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విలెమూన్ స్కూల్ వరకు, కొడంగల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ సూచిం చారు. ప్రతి నియోజకవర్గానికి 14వేల చొప్పున జెండాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ జెండాలకు కర్రలు ఏర్పాటుచేసి ర్యాలీలో పాల్గొనే వారందరికీ అందజేయాలని సూచిం చారు. 17వ తేదీన జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని, జిల్లా కేంద్రంలో ముఖ్యఅతిథి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొం టారని చెప్పారు. అలాగే హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో సీఎం కార్యక్రమానికి జిల్లాలోని ఎస్టీ అధికారులు, సిబ్బంది, ఎస్టీ వర్గాల ప్రజలను తరలించే ఏర్పాట్లు చేయా లన్నారు.
ప్రతి మండలానికి ఒక వాహనం ఏర్పాటు చేస్తామని, ఈ వాహ నాలు ఉద యం 8 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు. 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యా లయం లేదా అంబేద్కర్ భవనంలో కళాకారులతో సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వ హిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయ వంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్రావు, జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కు మార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహ సీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.