షాద్నగర్ : నిరుపేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్కు చెందిన సంతోష్నాయక్కు రోడ్డు ప్రమాదం జరిగి ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని పలువురు ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించిన ఆయన సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3లక్షలను మంజూరు చేయించారు. ఇందులో భాగంగానే సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కును శుక్రవారం సంతోష్నాయక్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూరదృష్టితో వైద్య రంగంలో అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజల అండగా నిలుస్తున్నాయన్నారు. సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, ఎంపీ రంజిత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.