తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఎమ్మెల్యే బాధితుని కుటుంబ సభ్యుల చేత ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రమేశ్కు లక్ష రూపాయల విలువ గల చెక్కు మంజూరైంది.
మంజూరైన చెక్కులను మంగళవారం బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అందించారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.