యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసోజు ఇంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన బిల్లులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా రూ. 20,000ల చెక్కును గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి టీఆర్ఎస్ నాయకులు లోహిత్రెడ్డి ఉన్నారు.