నందిగామ : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ మహాజన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సహకార సంఘం ద్వారా కొనుగొలు చేసిన రెండు వరి, మొక్కజొన్న కోత యంత్రాలను జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతన్నల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, రుణమాఫీ, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, డ్రిప్పుల పంపీణీ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నరన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే మద్ధతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. సహకార సంఘాల ద్వారా కూడా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, సహకారం సంఘాల ద్వారా ఉన్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు ప్రియాంకగౌడ్, మధుసుదన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి, బక్కన్న, మాజీ చైర్మన్ విఠల్, వైస్ చైర్మన్ పద్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, సర్పంచ్లు జెట్ట కుమార్, అశోక్, నర్సింహులు, స్వామి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.