చేవెళ్లటౌన్ : నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 53మంది లభ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం కళ్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు రూ. 5,306,148 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం నిరుపేదింటి ఆడపడుచులకు వరం లాంటిదన్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి పేదింటి ఇళ్లలో కేసీఆర్ దేవుడుగా నిలిచిపోయారన్నారు. వర్షాలు పడకముందే రైతులకు రైతు బీమపథకం కింద ఎకరకు 5వేల చొప్పున రెండు పంటలకు రూ. 10వేలు పెట్టుబడి సాయం అందించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు.
దీంతో పాటు రైతులకు రైతు బీమా ద్వారా రూ. 5లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల, ఎంపీపీ విజయల లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి, సర్పంచ్ బండారి శైలజ అగిరెడ్డి, తాసిల్దార్ అశోకుకుమార్, సర్పంచులు మల్లారెడ్డి, శివరెడ్డి, ప్రభాకర్, జహంగీర్, శంకర్, నాయకులు నాగార్జనరెడ్డి, సాయినాత్ లబ్ధిదారులు ఉన్నారు.