ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని సీతరాంపేట్ గ్రామానికి చెందిన సాతిరి ధానయ్య అనారోగ్యంతో నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి అతనికి రూ. 3లక్షలు మంజూరయ్యాయి. అట్టి చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానలో వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ నాయకులు అవుతాపురం రవిందర్, వెంకటేష్తో పాటు పలువురు పాల్గొన్నారు.