ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ యువజనసంఘం జిల్లా నాయకులు కర్నె అరవింద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ చెందిన కోడి వీరమ్మ అనారోగ్యంతో నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకోగా సుమారు మూడు లక్షల వరకు ఖర్చు అయ్యింది. దీంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి ఆమెకు రూ.లక్ష మంజూరయ్యాయి. అట్టి చెక్కును మంగళవారం ఇబ్రహీంపట్నంలో బాధితురాలి భర్తకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కిరణప్ప, వరప్రసాద్, రాజు ఉన్నారు.