షాద్నగర్రూరల్ : గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న సంఘటన షాద్నగర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణంలోని పటెల్రోడ్డుకు శివ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి గంజాయిని విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతని ఇంటి వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహించగా 100 గ్రాముల 19ప్యాకెట్ల గంజాయి దొరికిందని తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 15వేల వరకు ఉంటుందన్నారు. గంజాయి విక్రయిస్తున్న శివపై కేసు నమోదు చేశామని తెలిపారు. అదే విధంగా పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని సీఐ నవీన్కుమార్ తెలిపారు.
ఇదిలా ఉంటే షాద్నగర్ పట్టణంలోని ప్రజలతో పాటు యువకులను మత్తుకు బానిస చేసే విధంగా గతంలో గంజాయి విక్రయాలు జరిపిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందని, అయిన కూడా గంజాయి విక్రయాలు యధావిధిగా కొనసాగుతున్నాయని పోలీసులు ఇలాంటి వాటిపై మరింత నిఘాను పెట్టాలని పట్టణావాసులు కోరుతున్నారు.