షాద్నగర్ : 2022 జనవరిలో ప్రకటించే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉండొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇందులో భాగంగానే శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఎలాంటి లాజికల్ తప్పులు లేకుండ చూసుకోవాలని, ఓటరు సవరణ, మార్పులు చేర్పులు వంటి పనులను ఈ నెల 30లోపు పరిష్కరించుకోవాలని సూచించారు. మృతి చెందిన ఓటర్లను గుర్తించి వారి పేర్లను తొలగించాలని చెప్పారు.
ఒక్క పోలింగ్ కేంద్రంలో 1500మంది ఓటర్లు దాటితే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ మాట్లాడుతూ పెడింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగతిన పరిష్కరిస్తామని చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 18యేండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన అధికారికి వివరించారు.