మంచాల : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచాల ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. బుధవారం మంచాల మండలం బోడకొండ గ్రామంలో తీజ్పండుగను గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు సాంప్రదాయ పద్ధతిలో మెలకుల బుట్టలను ఎత్తుకోని డప్పువాయిద్యాల మధ్య దేవాయలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ నర్మద మాట్లాడుతూ ప్రతి ఏటా గిరిజనులు భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన పెద్దలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.