చేవెళ్ల టౌన్, మే,17: కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్లలోని ప్రభు త్వ దవాఖానను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సందర్శించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రిజిస్టర్ను పరిశీలించి రోజుకు ఎంతమందికి కరోనా టెస్టులు చేస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొవిడ్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్కారు దవాఖానల్లో కరోనా బాధితులకు మె రుగైన వైద్యం అందుతుందన్నారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితులను సీఎం కేసీఆర్ నిరంత రం పర్యవేక్షిస్తున్నారని, ఆయన నేతృత్వంలో ప్రజాప్రతినిధు లు, అధికారులు వైరస్ కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్, ఇతర వాటి విషయంలో ఇబ్బందులు రాకుండా చూస్తున్నారన్నారు. కొండాపూర్లోని జిల్లా దవాఖానలో 100 పడకలు, షాద్నగర్లో 50, జల్పల్లిలో 40, వనస్థలిపురంలో 50 బెడ్లు ఏర్పాటు చేశారన్నారు. ఇంటింటా ఫీవర్ సర్వేలో భాగంగా చేవెళ్ల మండలంలో 17వేల కుటుంబాలను సర్వే చేసి కొవిడ్ లక్షణాలు ఉన్న 450 మందికి మెడికల్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి కొవిడ్కు సంబంధించిన మందులు, ఇం జెక్షన్లు, ఆక్సిజన్ తదితర వాటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది కొవిడ్ రోగులను గుర్తించి చికిత్సకు అవసరమైన సాయం చేయాలన్నారు. వ్యాక్సిన్ కొనడానికి ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచిందని, అందరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి కృషి చేస్తున్నదన్నారు.
చేవెళ్ల దవాఖాన నుంచి నర్సులకు కొవిడ్ డిప్యూటేషన్లు వేస్తున్నారని వైద్యుడు ప్రదీప్కుమార్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆమె వారి సేవలు ఇక్కడే అవసరమని, వేరే దవాఖానకు పంపించవద్దని, ఈ విషయమై డీఎంహెచ్వోతో మాట్లాడుతానని చెప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ పీ రమణారెడ్డి, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, ఆర్డీవో వేణు మాధవరావు, తాసిల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో హరీశ్కుమార్, వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.