సిటీబ్యూరో, ఏప్రిల్ 9 ( నమస్తే తెలంగాణ ) : పర్వతాలను ఎక్కేయడం అంత సులువు కాదు. అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని ముందుకు సాగడం ఆషామాషీ కాదు. అది చాలా క్లిష్టమైనది. రాత్రి, పగలు తేడా లేకుండా పర్వతారోహణ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అంతకుమించి ఆరోగ్యం సహకరించాలి. అప్పుడే సాహస యాత్రకు పూనుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కాలం చిన్నారులు చిన్న చెట్టు ఎక్కడానికే జంకుతారు. అలాంటిది వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కడం సాధ్యమయ్యే పనేనా? అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ నగరానికి చెందిన చిన్నారులు పర్వతాలను సునాయాసంగా ఎక్కేస్తున్నారు. రికార్డుల ఖాతా తెరుస్తున్నారు. అతి పిన్న వయసుల్లో ఈ ఘనతను సాధిస్తూ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటుతున్నారు. ఇటీవల చిన్నారులు విరాట్, సమన్యూ కిలిమంజారోను అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు.
కోచ్ది కీలక రోల్..
గతంలో చిన్నారులు సమన్యూ, సృజనలు ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించి.. కిలిమంజారోను ఎక్కి శభాష్ అనిపించుకున్నారు. 5,380 మీటర్ల లక్ష్యాన్ని ఛేదించి సమన్యూ రికార్డు నెలకొల్పాడు. తాజాగా సికింద్రాబాద్కు చెందిన ఏడేండ్ల బాలుడు విరాట్ చంద్ర కిలిమంజారోను అధిరోహించాడు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జవదేకర్ తన ట్విట్టర్లో విరాట్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. చిన్నారుల ఈ ఘనత వెనుక కోచ్ భరత్ది కీలక రోల్. ఎత్తయిన పర్వతాల వద్ద వాతావరణం పర్వతారోహకులకే సవాలు విసురుతుంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితులను దాటుకొని అక్కడికి చేరుకోవడం వెనుక కృషి, పట్టుదల కావాలి. ఆ చిన్నారులకు స్ఫూర్తిని రగిలించే వారు ఉండాలి. 2017లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నగరానికి చెందిన భరత్ తమ్మినేని.. ఆసక్తి ఉన్న చిన్నారులను ఎంపిక చేసి పర్వతాలను అధిరోహించడంలో దన్నుగా నిలుస్తున్నారు.
ఆసక్తి ఉంటేనే..
భువనగిరి, అనంతగిరి కొండల వద్ద ట్రెక్కింగ్ చేయడంలో శిక్షణ తీసుకున్నాను. ప్రతి రోజూ వ్యాయామం చేసేవాడిని. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుని ప్రధాని, రాష్ట్రపతిల ప్రశంసలందుకోవడం సంతోషంగా అనిపించింది. నాకు ఎంతగానో సహకరించిన కోచ్ భరత్ కృషి గొప్పది. ఆసక్తి ఉంటే ఎవరైనా పర్వతాలను ఎక్కవచ్చు. అయితే శిక్షణ చాలా ముఖ్యం.
కోచ్ సూచనలు పాటించా..
ైక్లెంబింగ్ చేయాలని ఆసక్తి ఉండేది. మా కజిన్స్ ైక్లెంబింగ్ చేస్తారు. నేను కూడా వారిలాగా పర్వతాలను అధిరోహించాలని భావించాను. పేరెంట్స్కు విషయం చెబితే సరేనని ప్రోత్సహించారు. మా కోచ్ భరత్ వద్ద శిక్షణ తీసుకున్నాను. మొదటగా నగరంలో జరిగిన 5కే రన్ లాంటి పోటీల్లో నన్ను పంపించారు. ట్రెక్కింగ్, ైక్లెంబింగ్పై అవగాహన కల్పించారు. కిలిమంజారో అధిరోహిస్తున్న సమయంలో కొంత భయంగా అనిపించింది. కానీ కోచ్ భరత్ వెన్నంటి ఉండి నేను ముందుకు సాగడంలో ధైర్యాన్నిచ్చారు. థాంక్యూ టూ భరత్ సర్.
ఇవి తప్పనిసరి..
సుశిక్షితులైన కోచ్ ఆధ్వర్యంలో 75 రోజుల శిక్షణ ఉంటుంది.
మౌలాలి, భువనగిరి, అనంతగిరి కొండల వద్ద ఉదయం, సాయంత్రం కఠోర సాధన.
తొలుత ట్రెక్కింగ్పై.. అనంతరం ైక్లెంబింగ్లో శిక్షణ ఇస్తారు.
చిన్నారుల ఆసక్తితో పాటు ఆరోగ్యాన్ని పరిశీలించాకే ఎంపిక.
వాకింగ్, రన్నింగ్లో ఎనర్జీ లెవల్స్ గుర్తింపు.
ఆహార శైలిలో మార్పు తప్పనిసరి. డైట్ మెయింటేన్ చేయాలి.
పర్వతాలపై విషయ పరిజ్ఞానం తెలిసుండాలి.
శిక్షణలో శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి.
ఇవీ కూడా చదవండి…
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి