ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 9: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు నూతనరోడ్ల నిర్మాణం కోసం రూ.7.33కోట్ల నిధులు మంజూరైనట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. పీఎంజీఎస్వై ఫేజ్-3 రెండవ బ్యాచ్లో ఈ మేరకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మం డలం తుర్కగూడ నుంచి పోచారం మీదుగా కొంగరకలాన్ వరకు నూతనరోడ్డు నిర్మాణం కోసం రూ.4.76కోట్లు, యాచారం నుంచి చౌదర్పల్లి, చింతుల్ల మీదుగా కొలన్గూడ గేటు వరకు రూ.2.57కోట్ల నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు ఉత్తర్వులు జారీచేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కంకరతేలిన, గుంతల మయంగా మారిన ఈ రోడ్లను బీటీరోడ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులతో పరిపాలనా పరమైన అనుమతులు మంజూరై నట్లు చెప్పారు. టెండర్ల ప్రక్రియ త్వరిత గతిన ముగించి ఈ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, మండలపార్టీ అధ్యక్షుడు నిరంజన్రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులున్నారు.
కరోనా నుంచి రక్షణకు టీకానే ఆయుధం
కరోనా మళ్లీ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇబ్ర హీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు పీహెచ్సీ కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన సతీమణి మంచిరెడ్డి ముకుందలు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం టీకా తీసు కోవడమేన్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఉచితంగా ప్రభుత్వ దవాఖానాలో టీకా తీసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, డాక్టర్ అభిరాం, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…