జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల టవర్ సర్కిల్, ఏప్రిల్ 9: సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలో రోటరీ క్లబ్, ఆపి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ క్లబ్, ఆపి, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 14మందికి శుక్రవారం ఎల్ఎల్4 కృత్రిమ చేతి పరికరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎల్ఎన్4 చేతి పరికరాల పంపిణీకి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్ సికింద్రాబాద్ రొటేరియన్ కోటగిరి అమర్నాథ్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల శాఖాధికారి డాక్టర్ బోనగిరి నరేశ్, రోటరీ ప్రాజెక్ట్ చైర్మన్ మంచాల కృష్ణ, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సిరిసిల్ల శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, రోటరీ, ఆపి ప్రతినిధులు నాగరాజు, సురేందర్ రావు, ఆంటోని ముత్తు, టీవీ సూర్యం, కాశీరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయం