రంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు సం బంధించి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం లో కూడా పని దినాలను పెంచడం, తగ్గించడం లేకుం డా 80 లక్షల పని దినాలనే ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ వీలైనంతా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకుగాను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంతోపాటు ఇంకుడు గుం తల నిర్మాణం, నీటిఊట గుంతల నిర్మాణం పనులను చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రా రంభం నుంచి ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీ ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గత నెల చివర్లో 6 వేల వరకు ఉన్న రోజువారీ హాజరయ్యే కూలీల సంఖ్య ప్రస్తు తం 15 వేలకు పెరిగింది. వ్యవసాయ పనులు పూర్తిగా ముగిసిన దృష్ట్యా ఈనెలాఖరు వరకు ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 30 వేల వరకు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తైన దృష్ట్యా భూములను చదును చేసే పనులతోపాటు హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచడం తదితర పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు గత ఆర్థిక సంవత్సరం 80 లక్షల పనిదినాలను కల్పించాలని ల క్ష్యంగా నిర్ణయించగా,…60.16 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క కూలీకి వందరోజులపాటు పని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించ గా,..వంద రోజుల పని కల్పించడంలోనూ జిల్లా ముం దు వరుసలో నిలిచింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.237 లతోపాటు వేసవి దృష్ట్యా అదనంగా కూలీ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నది. ఏప్రిల్ మే మాసాల్లో 30 శాతం అదనంగా, జూన్ మాసంలో 20 శాతం అదనంగా చెల్లించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్కార్డులుండగా 2,88,580 మంది కూలీలున్నారు.
జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా 530 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా జిల్లాలోని మాడ్గుల మండలంతోపాటు కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో ఉపాధి పనులకు కూలీ లు హాజరవుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారంతోపాటు ఇంకుడు గుంతల నిర్మా ణం, నీటిఊట గుంతల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను రూ.112 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. వంద రోజుల పని కల్పనలో జిల్లా నాలు గో స్థానంలో నిలిచింది. జిల్లాలో గత సంవత్సరం 12, 785 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించారు. వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న కు టుంబాల్లో అత్యధికంగా మాడ్గుల మండలంలో 1601 కుటుంబాలు, యాచారంలో 1580 కుటుంబాలు, మంచాలలో 1299 కుటుంబాలు, కందుకూరు మండలంలో 1030 కుటుంబాలు ఉన్నవి.
వీలైనంతా ఎక్కువ మందికి ఉపాధి…
ఈ ఆర్థిక సంవత్సరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులకు హాజరయ్యే కూలీలకు వీలైనంతా ఎక్కువ మందికి ఉపాధి పను లు కల్పించేందుకు చర్యలు చేపడుతాం. మెజార్టీ కుటుంబాలకు వంద రోజు ల పని కల్పించేలా ప్రణాళికను రూపొందించాం. గత ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన లక్ష్యంలో 80 శాతం మేర పనులు కల్పించాం. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి పను లు కల్పించేలా చర్యలు చేపడుతాం.
ఇవీ కూడా చదవండి…
కోవాగ్జిన్ టీకా తీసుకున్న బోయినపల్లి వినోద్ కుమార్
సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు
జగ్జీవన్ రామ్కు ఎంపీ సంతోష్ కుమార్ నివాళి