హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
తన కుమారుడు డాక్టర్ బోయినపల్లి ప్రతీక్ కూడా కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి. అందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకా వేయించుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సందర్భంలో వైద్యులు, వివిధ హోదాలోని వైద్య సిబ్బంది ప్రజలకు అందించిన సేవలు మరిచిపోలేనివని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు